Wednesday, March 30, 2011


Mar 30, 2011

పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయం




భారత్ పాకిస్తాన్ల  మధ్య  నేడు  మొహాలిలో  జరిగిన  సెమి  ఫైనల్  మ్యాచ్ లో భారత్  29 పరుగుల  తేడాతో  విజయం  సాధించింది . పాకిస్తాన్  49.5 ఓవర్లలో  231 పరుగులు  చేసి  ఆల్  అవుట్  అయింది . మ్యాచ్  చివరివరకు  కొంత  ఉత్కంటగా  కొనసాగినప్పటికి  భారత్ దే  పైచేయని  25 ఓవర్లకే  తెలిసిపోయింది. చివరికి  పాకిస్తాన్  పై  భారత్  పైచేయి  సాధించి  వరల్డ్  కప్  ఫైనల్కి కి మార్గం సుగమం చేసుకొంది .

ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులందరికీ అత్యంత సంతోషం కలిగించే ఈ శుభవార్తని అందించిన మన భారత్ క్రికెట్ టీం కి మన అందరి అభినందనలు.

Friday, March 18, 2011

అసలు ఆ రోజు ఎం జరిగింది


జపాన్ ను సునామి, భూకంపం కబళించింది సుమారు పదిహేను వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఐదు వేల మంది కంటే ఎక్కువ మంది ఆచూకి లభించడం లేదు. ఇదిలా ఉంటె అసలు సునామి జరిగిన రోజు ఎం జరిగింది? అంటే మీడియా దగ్గర ఉన్న సమాచారం కంటే అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పిన సమాచారం వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.
"అప్పటికే సునామి ప్రమాదం ఉండనే సమాచారం లభించడం తో అక్కడ ఒక అధికారి అప్పుడే సునామి వస్తే ఎం జాగర్తలు తీసుకోవాలో చెప్పి వెళ్లి పోయాడు. అతను వెళ్ళిన ఒక అర గంటకు గోధుమ రంగు రంగులో ఉన్న ఒక పెద్ద అల నురుగులు కక్కుతూ చాలా ఉదృతంగా వస్తోంది. అది గమనిచిన అక్కడి ప్రజలు జాగ్రత్త పడే లోపే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. 
అక్కడే ఉన్న ఒక వ్యక్తి చెప్పిన విషయాలు వింటే ఆశ్చర్యం తో  పాటు, గగుర్పాటు కలగక మానదు. అప్పటికే సునామి హెచ్చరికలు రావడం తో కుటుంబం తో సహా  కొండ పైకి ఎక్కి కూర్చున్న ఆ వ్యక్తి ఇంట్లో ఉన్న ఇస్త్రీ పెట్టె బంద్ చేసేందుకు వెళ్ళిన అతను బయటికి వచ్చె లోపే ఒక పెద్ద అల అర కిలోమీటర్ దూరం నుంచి వస్తోంది. అది చూసి బయపడిన ఆ వ్యతి కార్ స్టార్ట్ చేసే లోపే ఆ  అల మున్చేసినంత పని చేసింది. కార్ స్టార్ట్ చేసిన వ్యక్తి గంటకు డెబ్బై కిలో మీటర్ల వేగంతో వెళ్తోంటే కార్ వెనకే వస్తోన్న ఆ అలను ఎలాగోలా తప్పించుకున్న ఆ వ్యక్తీ మరుసటి రోజు వచ్చి చూసే సరికి వాళ్ళ ఏమి లేదు అంతకు ముందు ఉన్న ఇళ్ళ ఆనవాళ్ళు కొద్ది కొద్దిగా కనిపిస్తున్నాయి. అక్కడ స్కూల్ కి వెళ్ళే పిల్లలకు సునామి వచ్చిన విషయమే తెలియద్నత. స్కూల్ కొండ మీద ఉండటం తో ఆ విద్యార్తులు స్కూల్ కి వెళ్ళిన తర్వాత జరిగింది కనుక వాళ్ళకి ఈ విషయం తెలియదు. ఆ రోజు ఆ విద్యార్తులను అక్కడే ఉంచారు. మరుసటి రోజు వాళ్ళు ఉండే ప్రదేశానికి తీసికేల్లగా అది  చూసిన పిల్లలు తమ ఇల్లు లేదని బోరున విలపిచారు. " అక్కడి వారి ఆర్తనాదాలు, తమ వాళ్ళని కోల్పోయి నిస్తేజంగా మారిన వాళ్ళ జీవితాలు చూస్తుంటే హృదయ విదారకంగా ఉంటుంది. 


జపాన్ సునామి మంది ని మింగేసింది 
జపాన్ లో సంభవించిన సునామి, భూకంప ప్రమాదాల్లో సుమారు ఇరవై వేల మంది కి పైగా చనిపోయినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నా ప్రాణ నష్టం అన్హ్త కంటే ఎక్కువగానే ఉంటున్నది ఒక అంచనా.