మళ్ళీ మనం క్రికెట్ లో విశ్వ విజేతలం !
ప్రతి భారతీయుడూ పులకిన్చేలా, ధాటిగా ఆడిన శ్రీలంకకు దీటుగా సమాధానం చెప్పి ధోనీ సేన మన భారతాన్ని మళ్ళీ ప్రపంచ కప్ చాంపియన్ గా నిలపెట్టారు ! దేశం కోసమనీ, సచిన్ కోసమనీ చెపుతున్నా జట్టులోని ప్రతి వ్యక్తీ వ్యక్తిగతంగా కూడా గెలుపు ఉద్వేగాన్ని అణుచుకో లేక కంట తడి పెట్టడం చూస్తోంటే చాలా హృద్యంగా అనిపించింది !
టోర్నమెంట్ మొదట్లో పసికూనలతోనూ సీరియస్ గా చివరి వరకూ నరాలు తెగేలా టెన్షన్ అనుభవిస్తూ గెలిచినా ఉద్దండ పిండాలయిన అసీస్, సవుత్ ఆఫ్రికా, పాక్, శ్రీలంక టీములతో సమిష్టి కృషితో తన గొప్పదనాన్ని చాటుతూ నిలబెట్టుకుంది ! సచిన్ కి వందో శతకానికి ఇంకా సమయం వున్నట్లు ఉంది !
భారత క్రికెట్ జట్టుకు ఘనమైన హృదయపూర్వక శుభాకాంక్షలు !
ఇంకా ముందు కూడా ఇదే స్పూర్తి తో ఆడి దేశానికి, తమకూ పేరు తేవాలని కోరుకుందాం !
No comments:
Post a Comment