Saturday, April 23, 2011

భారత్ అంటే అందరికి ఎందుకింత అలుసు?

మన దేశం ఇరుగు పొరుగు దేశాలకి ఎంతగా తన స్నేహహస్తం అందిస్తున్నపట్టికీ, వాటి అభివృద్దికి ఎంతగా సహాయ సహకారాలు అందిస్తున్నపటికీ, భారతదేశం పట్ల అకారణ విద్వేషం పెంచుకొని, ఏదో రూపంలో మనపై విషం చిమ్ముతూనేఉన్నాయి మన పొరుగు దేశాలయిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, చైనా, మరియు శ్రీలంకలు. అయినప్పటికీ వాటన్నిటిని సహిస్తూ వాటి పట్ల మెతక వైఖరి కనబరుస్తూనే ఉంటుంది మన భారత ప్రభుత్వం. ఎందుకంటే, మనదంతా శాంతి... ఓం శాంతి పద్ధతి. మన ఇరుగు పొరుగు చల్లగా చక్కగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. గాని, మనల్ని ఎదుటివాడు ఎంత చులకనగా చూసిన సర్దుకు పోవలసిందేనా? 

ఇటీవల మన పొరుగు దేశమయిన నేపాల్లో భారత దౌత్యవేత్త రాకేష్ సూద్ నిర్వహించిన కార్యక్రమాన్ని మావోయిస్టులు అడ్డుకుని.. భారత్ వ్యతిరేక నినాదాలు చేయడం, భారత జాతీయ పతాకాన్ని అగౌరవపర్చడం చేసారు. దానిని మన  భారత విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణ.. ఖండించడం షరా మామూలుగానే జరిగింది.

ఇక పక్కలో బల్లెంల తయారయిన పాకిస్తాన్, చైనాలగురించి చెప్పేదేమీ ఉంది? అత్తా సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ఆక్రమిత కాశ్మీరులో చైనాకి బాగం పంచి ఇచ్చి పాకిస్తాన్, చైనాలు మరో యుద్ధానికి సమయత్తమవుతున్నాయని, రోజు సుప్రభాతంలా మన వేగులు చెవిన ఇల్లు కట్టుకొని పాడుతూనే ఉన్నారు.  ముందు అరుణాచల్ ప్రదేశ్ తమదని వాదించిన చైనా ఇప్పుడు ఏకంగా ఈశాన్య భారతాన్నే వేరుచేసే కుటిలయత్నాలు చేసుకు పోతోంది చాప కింద నీరులా.అయిన ఏదో తెలియని నిర్లిప్తత, నిరాసక్తత.

ఇక, ఒకప్పుడు బంగ్లాదేశ్కి తోడ్పడిన కృతజ్ఞాతకో లేక పాపానికో ఆ దేశం మనకి వేసిన శిక్ష ఏమిటంటే నిత్యం వేలాదిమంది తన పౌరులని మన దేశంలోకి తోలేస్తోంది. ఇప్పుడు వారంతా కలిసి మన ప్రజా స్వామ్యవ్యస్తలో కీలక భాగామయిపోయారు. వారికి మన ప్రజలతో సమానంగా కొండొకచో ఇంకా ఎక్కువగా సకలసదుపాయలు కల్పిస్తూ మన రాజకీయనాయకులు ఒక కొత్త వోటు బ్యాంకుని ఏర్పాటు చేసుకొన్నారు.దేశమేమయిపోయిన పరువలేదు, తాము గద్దెనెక్కే మార్గం సుగమం అయితే అదే చాలు అనుకొనే మన రాజకీయనాయకులున్నారు మనకి.

ఇక శ్రీలంకకి సహాయం చేసినందుకు ఒక ప్రధానినే బలి పెట్టుకొన్న ఘనత మనకే స్వంతం. అది చాలదన్నట్లు, ప్రస్తుతం తమిళనాడులో కొంతమంది రాజకీయ నాయకులూ నిన్ననే ఒక ఊరేగింపు చేసి మన దేశం శ్రీలంక తమిళులకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు.

ఇవన్నీ, మన కంటికి స్పష్టంగా కనబడుతున్న చేదు నిజాలు. ఇంకా, సామాన్య జనానికి తెలియని వెన్ని జరుగుత్తునాయో మన ప్రభుత్వాలకి, ఆ పైనున్న దేముడికే తెలియాలి. మన పట్ల ఇంతగా వ్యతిరేఖత పెరిగి పోవడానికి, మన పట్ల నేపాల్ వంటి ఓ చిన్న దేశానికూడా చులకన బావం ఏర్పడడానికి కారణం ఏమిటి? 
మన చేతగాని విదేశంగా విధానమా? లేక మన నిర్లిప్తతా? లేక మన అలసత్వమా?

No comments:

Post a Comment