Monday, January 31, 2011


Monday, January 31, 2011

త్రిష కోరిక తీర్చిన సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌

 '' మీరు కనుక అంగీకరిస్తే ఎన్నాళ్లుగానో నా మనసులో ఉన్న కోరికను నెరవేర్చుకుంటూ'' అని ఫ్లయిట్‌ ఎక్కగానే తెల్లని కాగితంలో ముత్యాలను తలపించే దస్తూరీతో పైలట్‌కి రాసి పంపిస్తుంటారట త్రిష. ' కాకిపిట్‌' లో కూర్చుని విమానాన్ని పైలట్‌ ఎలా నడుపుతున్నారో చూడాలన్న త్రిష కోరిక. ఇది చిన్న కోరికేం కాదు. అయినా సరే ఎలగైనా తీర్చుకోవాలి త్రిష పంతం పట్టారు. విమానిం ఎక్కిన ప్రతిసారీ తన ప్రొపైల్‌ను ఎయిర్‌ హేస్టస్‌కి ఇచ్చి పైలట్‌కి అందజేయమని కోరుతుంటారట త్రిష.
గత కొన్ని సంవత్సరాలు ఈ వ్యవహారం సాగుతోంది. దానికి కారణం తమతో పాటు కాక్‌పిట్‌లో ప్రయాణీకులు ఉంటే అధికారులకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందన్న భయమే. ఇటీవల తన కోరిక నెరవేరిందని సమాచారం. ఎప్పటిలానే త్రిష విమానం ఎక్కి తన సీట్లో కూర్చోగానే పైలట్‌కు ప్రొపైల్‌ పంపించారట. ఈ సారి కూడ ' నో ' అనే సమాధానమే వస్తుందని ఫిక్స్‌ అయ్యారట. కానీ పైలట్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో త్రిష ఆశ్చర్యపోయారట. కాక్‌పిట్‌లో కూర్చుని విమానాన్ని పైలట్‌ ఎలా కంట్రోల్‌ చేస్తున్నారో కాసేపు తిలకించి త్రిష ఆనందపడ్డారట. తన కోరిక నెరవేరినందుకు శ్రేయోభిషుల దగ్గర ఆ ఆనందాన్ని కూడా పంచుకున్నారట. ఇంతకీ త్రిష కోరిక తీర్చినది మన ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ కాదు .. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్.....

చిరంజీవికి జనమంటే లోకువ!?

    చిరంజీవి తన బామ్మరిది అల్లు అరవింద్ దుష్టమంత్రాంగం మైకంలో పడి తను మంచి లీడర్గా ఎదిగే అవకాశాలను తనే చేజేతులా పోగొట్టుకుంటున్నాడు. రాజకీయాలను కూడా ఓ పక్కా సినిమా వ్యవహారంగా చూడటమంటే తనంతటతనే ఒక నాయకుడిగా ఎదిగే మార్గాన్ని మూసేసుకుంటున్నాడన్నమాట! మొన్నటి తన ఎన్నికల వైఫల్యానికి సరైన కారణాలు అన్వేషించకుండా, అవి దిద్దుకునే ప్రయత్నాలు చేయకుండా చిరంజీవి మరో తప్పు చేస్తున్నారు!
     సినిమాల నుంచి రాజకీయాల్లోకి రావడానికి ముందు ఎంటీయార్ చాలా ఆలోచించారు. తనకున్న అధ్బుతమైన ఫాలోయింగ్ ను మాత్రమే నమ్ముకోలేదు ఆయన. అప్పుడు భ్రష్టుపట్టిపోయిన కాంగ్రెస్ రాజకీయాలతో జనం విసిగిపోయి ఉన్నారు. గ్యాప్ పూడ్చటంలో ప్రతిపక్షాలు కూడా విఫలమయ్యాయి. అందుకని ఆ స్పేస్ తనకు బాగా ఉపయోగపడింది. మొత్తం ఆయన కమ్యూనిటీయే కాకుండా మార్పు కోరిన జనమంతా బ్రహ్మరథం పట్టారు. కేవలం వీటినే పట్టించుకోకుండా ఆయన రెండు రూపాయల బియ్యం వంటి హామీలను, జాతి ఆత్మగౌరవం వంటి కదిలించగలిగిన నినాదాలనూ ఆయన నమ్ముకున్నారు. అన్నింటికీ మించి ఆయన పదునైన ప్రసంగాలు, కాంగ్రెస్ పైన ఎక్కుపెట్టిన తీవ్ర విమర్శలు కూడా పనికొచ్చాయి. తను టికెట్లు ఇచ్చినప్పుడు ఎక్కువగా రాజకీయంగా వెనుకబడిన వర్గాలు, చదువుకున్నవారు, కొత్తవారికి ప్రాధాన్యం ఇచ్చారు. "నిష్కళంక" అనే ముద్ర కోసం ప్రయతించారు. మరి చిరంజీవి విషయంలో ఏం జరిగింది? 
     తను రాజకీయాల్లో చేరే విషయంలో విపరీతమైన హైప్ క్రియేటైంది. ఎప్పుడూ అంత హైప్ క్రియేట్ కావడం సినిమాల్లో ఓపెనింగ్ కలెక్షన్లను పెంచుతుంది కానీ ఎక్కువరోజులు సినిమా నడవటానికి ఉపయోగపడదనేది చిరంజీవికి తెలియంది కాదు. ఒకవైపు పాతుకుపోయిన వైఎస్, మరోవైపు కేడర్ బలమున్న చంద్ర బాబు ఉన్న స్థితిలో చిరంజీవి తనకు పెద్ద స్పేస్ క్రియేట్ కావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని గమనిచలేకపోయారు. ముందే చెప్పినట్టు హైప్ కారణంగా సభలకు జనం విపరీతంగా వచ్చారు కానీ దాన్ని వోట్ల రూపంలోకి మార్చుకునే విషయంలో అన్నీ తప్పుటడుగులే పడ్డాయి. దీనికి అరవింద్ ప్రధానకారకుడు. గెలిచేవారికి టికెట్లకు ఇచ్చి ముందు ఎన్నికల పరీక్షలో గెలవడానికి ట్రై చేయాల్సింది పోయి అమ్మకానికి పెట్టారు. ఎవడిని నిలబెట్టినా గెలుస్తారనే భ్రమో, డబ్బు వచ్చినప్పుడు ఎందుకు వద్దనాలనే సినిమా బుద్దో కానీ అక్కడే పార్టీ సగం భ్రష్టుపట్టింది. పసలేని ప్రసంగాలు, ప్రభావం చూపించలేని నినాదాలతో చిరంజీవి తన అభిమానులనే నిరాశపరిచాడు. నిజానికి తనకొచ్చిన వోట్లు, సీట్లు కూడా ఎక్కువే అని రాజకీయ విశ్లేషకుల విస్మయం. పోనీ తరువాతైనా పార్టీని నిలబెట్టడానికి ట్రై చేశాడా అంటే అదీ కరువైంది. సబ్జెక్ట్ లేకపోవడం, పార్టికి ఏ విషయంలోనూ ఓ వైఖరి లేకపోవడం, ఎవరినీ నమ్మలేకపోవడం, తనకే సీరియస్ నెస్ లేకపోవడం, అనుభవలేమి కారణంగా తెలంగాణాపై యూటర్న్ తీసుకోవడం వంటి అనేకానేక లోపాలతో ఒక్కొక్కరే వదిలిపోయారు. రాజకీయ నిష్క్రియాపరత్వం ఎంతటి పెద్ద పార్టీనైనా (విపక్షంలో ఉన్నప్పుడు) దెబ్బ తీస్తుంది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టికి పీఆర్పీ అవసరం వచ్చిందో అరవింద్ మళ్లీ క్రియాశీలమయ్యారు. డబ్బు వచ్చే చాన్స్, పదవి దక్కే చాన్స్ కళ్లముందు డాన్స్ చేస్తూ కనిపించాయి. ఇక్కడ తను సొంతంగా విధాన నిర్ణయాలు తీసుకునే సత్తా లేని చిరంజీవి మళ్లీ తప్పుటడుగులు వేస్తున్నారు. 
* ప్రస్తుతం రాష్ట్రంలో కొంత పొలిటికల్ స్పేస్ కనిపిస్తోంది. తనకు నిజంగా రాజకీయ భవిష్యత్తుపై ఆలోచన ఉంటే తల లోపాలు సరిదిద్దుకుని విస్తృతంగా జనంలోకి వెళ్లాల్సి ఉంది. కానీ ఎంతసేపూ ఇప్పుడున్న సంఖ్యాబలంతోనే ఎంత "లబ్ది" పొందాలనే ఆశ తప్ప ఒంటరిగా బలపడాలనే ఆలోచన కనిపించడం లేదు.
* ఒకవేళ విలీనానికి అంగీకరిస్తే ఇప్పుడున్న ఎమ్మేల్యేలతోపాటు మరికొన్ని సీట్లు తను అడుగుతాడు. అది కాంగ్రెస్, పీఆర్పీ రెండింటికీ నష్టమే. పరోక్షంగా జగన్ తలపై పాలు పోయడమే.
* కేవలం వ్యూహాత్మక మద్దతుకే పరిమితమై కేబినెట్లో చేరినా కాంగ్రెస్ పైన కనిపించే వ్యతిరేకత ప్రభావాన్ని కూడా పీఆర్పీ భరించాల్సి ఉంటుంది.
* ఇప్పుడు దక్కబోయే దానిపైనే అరవింద్ ఆశ. తనకు రాజ్యసభ అందులో ఒకటి. ఒకసారి కాంగ్రెస్ పార్టికి మద్దతు ఇచ్చినా, విలీనం జరిగినా తరువాత ఆ పార్టీ ఎలా ఆడుకుంటుందో చిరంజీవికి తెలుసుకోలేకపోతున్నాడు.
* పక్కా సమైక్యవాదితో పొత్తు, మద్దతు, విలీనం ద్వారా కాంగ్రెస్ తెలంగాణాలో మరింత బలహీనపడటం ఖాయం.
ఈ వైఫల్యాల మాటెలా ఉన్నా కాంగ్రెస్ తో చేతులు కలపడాన్ని చిరంజీవి నైతికంగా ఎలా సమర్థించుకోగలరు? ఆయనకు వేసిన 69 లక్షల వోట్లు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వేసినవే కదా? "మార్పు కోసం" పేరిట రాజకీయం చేసిన తను ప్రజలకు ఏమని సమాధానం చెబుతారు...? ఊరూరా కాంగ్రెస్, టీడీపీ శ్రేణులతో పోరాడిన ఆయన అభిమానులకు ఇది శరాఘాతం కాదా...? "పిచ్చి" ఆవేశంతో ఎన్నికల ప్రసంగాలు చేసిన కొమురం పులి ఇప్పుడు ఎటు పోయాడు...? చిర్నజీవి సీఎం కావలని రాజకీయాల్లో చేరినా... ప్రజలు మాత్రం ఇప్పుడే తనకు సీఎం అయ్యే అర్హత లేదని, కానీ ఇంకా కొంత కష్టపడాలనీ తీర్పు చెప్పి కొన్ని వోట్లు వేశారు. అవి తక్కువ వోట్లేమీ కావు. ఇప్పుడు తను పార్టీని నడిపించలేక, ఏదో ఇలా కాంగ్రెస్ లో చేరి కథ నడిపించేద్దామని ప్రయత్నించడం ఆయన రాజకీయ అనుభవరాహిత్యాన్నే బయటపెడుతోంది. అంతేకాదు ఆయన ప్రస్తుత వైఖరి తనకు వోట్లేసిన వారిని ఒకరకంగా అవమానించడమే అవుతుంది. రాజకీయకోణంలో ఇది కరెక్టో కాదోననే చర్చ ఎలా ఉన్నా నైతికత కోణంలో మాత్రం అసమంజసం!

Saturday, January 29, 2011

కామ సూత్రాల్లో చెప్పని కొన్ని ముఖ్య విషయాలు.

సెక్స్ భార్యతో జరిగితే అది 'డ్యూటీ'.
ప్రేమికురాలితో జరిగితే అది ' ఆర్ట్'
కన్యతో జరిగితే అది ' ఎడ్యుకేషన్'
వేశ్యతో జరిగితే అది ' వ్యాపార లావాదేవి'
విడాకులు తీసుకున్న ఆమెతో జరిగితే అది 'సామాజిక సేవ'
భర్తహీనతో జరిగితే అది ' విరాళం'

ఈ వేళలో నీవు ఏంచేస్తూంటావో..అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూనేను..

గులాబి సినిమాలో గుండెకు హత్తుకునే పాట ఇది..ఇద్దరు నిజమైన స్నేహితులు ప్రేమికులు దూరంగా విడిపోయినప్పుడు...వారి మదిలో మెదిలే బావాలు ఇలాగే ఉంటాయి ఇది ప్రతి ఓక్కరికి జీవితంలో తారసపడే ఘటనే తాలూకా వాస్తవ రూపమే ఈ పాట... ఈ వేళలో నీవు ఏంచేస్తూంటావో..అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూనేను..నీ పరిచయంతోనే నాగుండె జారిపోయింది..నీ వైపు వెల్లిన నామనసు నీ నీడగా మారి నావద్దకు రానంటుంది..నాకు దూరంగా ఉంటూనే ఏమాయ చేస్తున్నావు...గతంలో కల్సి తిరిగిన స్నేహితులు గుర్తుకు వచ్చినప్పుడు .. ఆ సమయం గుర్తుకు వచ్చి ఈ సమయంలో ఏంచేస్తున్నావు అని భాధగా అప్పటిజ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకునే పాట..ఈ పాటలో ప్రతి పదం లో నిజంఉంది..పాట లోని మ్యూజిక్ వింటుంటే గండె వేగం పెరుగుతుంది అలోచనలు మనమాట వినకుండా మనల్ని వీడి ఎక్కడికో వెళ్ళిపోతాయి..సైలెంటు మ్యూజిక్ ఈ పాటకు హైలెట్..నీవు మదిలో గుర్తుకు రాగానే అస్సలు నాకు నిదరేరాదు అన్నీ నీతలపులే కాలాన్ని ఎలాగడపాలి నీజ్ఞాపకాలకు దూరంగా..రాత్రుల్లే కాదు పగలు కూడా కాసేపు పడుకోనీయవు నా ద్యానం అంటా నీమీదనే ఎటు వైపు చూసినా నీవే గుర్తుకు వస్తున్నావు....నీవు కాక నాకు ఏమి గుర్తుకు రావడంలేదు అనే చరనాలు నిజంగా మనసుకు మత్తునిస్తాయి..నిజంగా నిజాయితీ గా ప్రేమించే వాళ్ళకోసమే ఈ పాట ..ప్రేమను ప్రేమగా ప్రేమించలేని వారు...ప్రేమపేరుతో మోసపోయిన వారూ ఆ పాతజ్ఞాపకాలు గుర్తుకు వచ్చినప్పుడు ఈ పాట మనసులోని గాయాన్నీ కెలుకుతుంది కచ్చితంగా.......ప్రేమించానంటూ మోసం చేసిన వారు నిజంగా పాతజ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటారా..నిజంగా ప్రేమించాను అని చెప్పి నాది నిజ మైన ప్రేమ నాప్రేమలో రెస్పెక్టు ఉంది అని చెప్పి మాటతప్పిన వారికి నిజంగా ఇలాంటి పాతజ్ఞాపకాలు గుర్తుంటాయా ప్రేమిస్తున్నప్పుడు ప్రతిక్షనం నీవే గుర్తుకు వస్తున్నావని చెప్పి ఎలామోసం చేయగలుగుతారు..ప్రేమలో ఎంతమందికి అవకాశంఉంటుంది..ఎంతమందిని నిజాయితీగా ప్రేమిస్తారు..అప్పుడు ప్రేమతో అన్నమాటలు ఎప్పుడైనా గుర్తుకు వస్తాయా? ఏమో?..నిజంగా స్వచ్చంగా ప్రేమించేవారు ఒక్కరిని ప్రేమిస్తారు ఆరాధిస్తారు వారు దగ్గర ఉన్నా దూరం అయినా తన కు ఇష్టం అయినవారి గురించి చెబితే ఎలానమ్ముతారో అర్దం కాదు..నమ్మకం లేకుండా గతంలో ఎందుకు ప్రేమించారు...అలా తనకు ఇష్ట ఉన్నవారి మీద లేనిపోనియి ఎవ్వరైనా చెబితే నిర్దారించుకోకుండా దూరం అవుతారు వారి ప్రేమలో నిజాయితీ లేనట్టేకదా..? ఒక్కోసారి అనిపిస్తుంది అంత ఇష్టం ఒక్కసారిగా ఎలా మారిపోతుందో...అందుకే ఇలాంటి పాటలు పాత జ్ఞాపకాలని కెలికి భాదను పెంచుతాయి..అంతే అదా అలాంటి పాతజ్ఞాపకాలు గుర్తుకు వచ్చిపుడు భాదపడటంతప్ప ఏమి చేయలేం..

Friday, January 14, 2011

హీరోయిన్స్ ఇద్దరూ తమ పరిధులు మేరకు బాగానే చూపారు...అదే నటించారు:Mirapakaya review

-సూర్య ప్రకాష్ జోశ్యుల
సంస్థ: ఎల్లో ఫ్లవర్స్‌
నటీనటులు: రవితేజ, రిచా గంగోపాధ్యాయ, దీక్ష సేథ్‌, ప్రకాష్ ‌రాజ్‌, కోట శ్రీనివాసరావు,
సునీల్‌, చంద్రమోహన్‌, అలీ, సురేఖావాణి, అజయ్‌, సుధ తదితరులు.
సినిమాటోగ్రఫీ: సి.రామ్ ప్రసాద్
సంగీతం: తమన్
కూర్పు: గౌతమ్ రాజు
సంగీతం: తమన్‌
నిర్మాత: రమేష్‌ పుప్పాల
కధ, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్

గతంలో "షాక్" ఇచ్చిన డైరక్టర్ తో రవితేజ మరోసారి సాహసం చేస్తున్నాడంటే...గ్యారెంటీగా స్క్రిప్టు అధ్బుతంగా ఉండి ఉంటుంది అని ఎక్సపెక్ట్ చేయటం సహజం. అయితే అది అత్యాసే నని, రవితేజ ఎప్పటిలాగే స్క్రిప్టు ఎలాగున్నా తనదైన టిపికల్ మ్యానరిజంస్ తో, అల్లరి చేష్టలతో సినిమాను లాగించేయచ్చు అని నమ్మి ఈ చిత్రం చేసినట్లు స్పష్టమవుతుంది. షారూఖ్ ఖాన్ హిందీ చిత్రం "మైహూనా" ను ప్రక్కన పెట్టుకుని కథ అల్లుకున్నట్లున్న ఈ చిత్రం ద్వితీయార్ధం ప్రారంభం నుండి మెల్లిగా డ్రాప్ అయిపోతూ..పోతూ...క్లైమాక్స్ కి వచ్చేసరికి పూర్తిగా జారిపోయింది. హరీష్ శంకర్...మాటల రచయితగా పంచ్ డైలాగులు వేసి నవ్వించాడు కానీ కథకుడుగా రాణించలేకపోయాడు. అలాంటి స్ధితిలో సినిమాను చివరిదాకా భరించగలిగాము అంటే అది రవితేజ ఎనర్జీతో ఇచ్చిన కిక్కే అని చెప్పాలి.

ఇంటిలిజెన్స్ ఆఫీసర్ అయిన రిషి(రవితేజ) ఉరఫ్ మిరపకాయ ఓ మిషన్ నిమిత్తం డిల్లీ నుంచి హైదరాబాద్ వస్తాడు. ఆ మిషన్ లో భాగంగా ఓ కాలేజీలో హిందీ లెక్చరర్ గా జాయిన్ అవుతాడు. ఖాళీగా ఉండటమెందుకన్నట్లు అక్కడి స్టూడెంట్ వినమ్ర(రిచా గంగోపద్యాయ్)తో ప్రేమలో పడి పాటలు పాడుతుంటాడు. ప్రేమ ఓ కొలిక్కి వచ్చిందనగా అతనికి అప్పచెప్పిన మిషన్ పూర్తి వివరాలు తెలుస్తాయి. వాటి ప్రకారం ఆ కాలేజీ కొత్త స్టూడెంట్ వైశాలి(దీక్షా సేధ్) ని రిషి...ప్రేమలో పడేయాలని ఆ మిషన్ లక్ష్యం అని తెలుస్తుంది. అప్పుడు రిషి తన ప్రేయసి ఎదురుగా వైశాలిని ఎలా ప్రేమలో దించాడు...ఇంతకీ వైశాలిని ప్రేమలో పడేయటానికి ఇంటిలిజెన్స్ కు ఉన్న కారణం ఏమిటి అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్రేమ కోసం ఒకరిని, ప్రొఫెషన్ కోసం మరొకరిని ప్రేమలో పడేయటమే పాయింటు రవితేజకు నచ్చి ఈ చిత్రం ఓకే చేసి ఉండవచ్చు. కానీ నిజంగా ఓ అమ్మాయిని ప్రేమలో దింపి మాఫియాడాన్ అయిన అతని తండ్రిని పట్టుకోవాలనే వింత ఆలోచన ప్రపంచంలో ఏ ఇంటిలిజెన్స్ డిపార్టమెంట్ అయినా చేస్తుందా...చేయాలనుకున్నా ప్రేమలో దింపటమెందుకు...దొరికిన అమ్మాయిని ఏ కిడ్నాపో మరొకటో చేసి ఆమె తండ్రిని పట్టుకోవచ్చుకదా అని ఈ చిత్రం చూస్తున్నంతసేపూ తొలుస్తుంది. అలాగే విలన్(ప్రకాష్ రాజ్) పాత్ర ఎక్కడో క్లైమాక్స్ దాకా కథలోకి రాదు. అతన్నిహీరో చంపితే బాగుండును, అతను దుర్మార్గుడు కదా అనే ఆలోచన మనకు పొరపాటున కూడా కలగదు. దాంతో హీరో అతన్ని చంపుతూంటే హీరో ఎందుకిలా చేస్తున్నాడు అనే డౌట్ వస్తుంది. దానికితోడు తన కూతురుని ప్రేమ పేరుతో ట్రాప్ చేస్తున్నారనే విషయం ఆ ఇంటర్నేషనల్ డాన్ కి క్లైమాక్స్ దాకా కూడా తెలియదు. దాంతో అతను హీరోని పట్టించుకోడు. హీరో కూడా క్లైమాక్స్ దాకా అతని జోలికి వెళ్లడు. దాంతో అస్సలు సినిమా ఎటుపోతుందో చూసేవారికి అర్దం కాదు.

మొదటే చెప్పుకున్నట్లు ఈ చిత్రంలో డైలాగులు బావున్నాయి. అయితే డైలాగులతోనే సినిమా మొత్తం నడిపేయటం నచ్చదు. అలాగే దర్శకుడుగా షాక్ నాటి షార్ప్ నెస్ ఎందుకనో చిత్రంలో మిస్సైందనిపిస్తుంది. హీరోయిన్స్ ఇద్దరూ తమ పరిధులు మేరకు బాగానే చూపారు...అదే నటించారు. కోట, ప్రకాష్ రాజ్ ఇద్దరూ కొన్ని వందల సార్లుచేసిన పాత్రే చూస్తున్నాం అనిపిస్తుంది. పాటల్లో రెండు బాగున్నాయి..ధియోటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కెమెరా, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే.

ఏదైమైనా ఇది రవితేజ సినిమా ఇలాగే ఉంటుంది అని ఫిక్సై వెళితే ఫరవాలేదనిపిస్తుంది. కాస్సేపు నవ్వుకుందామని వెళ్తే అల్లరి నరేష్ సినిమాలా ఎంటర్టైన్ చేస్తుంది.అ దే మంచి మాస్ మసాలా సినిమా చూద్దామనుకుంటే మాత్రం నిరాశపరుస్తుంది. మిరపకాయ్...ఘాటు ఉంటుందని మాత్రం ఎక్సపెక్ట్ చేయద్దు.

పరమ వీర చెత్త

“యంగ్ ఇండియా” వంటి డిజాస్టర్ సినిమా తీసి ఈ మధ్య కాలంలో తన సత్తా ఏంటో ప్రపంచానికి తెలిపిన దాసరి తన తదుపరి చిత్రానికి బాలకృష్ణను హీరోగా ఎంపికచేసుకున్నాడనగానే అంతటా అంచనాలు కన్నా అనుమాలు ఎక్కువ మొదలయ్యాయి. అయితే సింహా ఇచ్చిన కిక్ తో బాలయ్య చాలా జాగ్రత్తగా ఉంటాడని, దాసరి కూడా తన 150 చిత్రం కదా అని చాలా జాగ్రత్తలు తీసుకుంటాడని ఎవరకి వారే సర్దిచెప్పుకుని రిలీజ్ కోసం ఎదురుచూసారు. అయితే వారి ఆశలు నిరాశలే అయ్యాయి. అభిమానులు సైతం ఫరవాలేదు అనలేని స్ధితిలో చిత్రం తెరకెక్కింది. సైనికాధికారిగా, సినీ హీరోగా, రావణాబ్రహ్మగా, కొమురం భీమ్ గా రకరకాల గెటప్స్ లో బాలకృష్ణ కనపించి అలరించినా, అదంతా బాలకృష్ణ ఇన్నిగెటప్స్ వేసి ఒప్పించగలడు, ఇంత బాగా చేయగలడు అని చెప్పటానకి ప్రత్యేకంగా పనిగట్టుకుని తయారు చేసిన ప్రచార చిత్రంలా తయారైంది. కథా లోపమే కాక దశ, దిశ లేని దర్శకత్వం పాపం కూడా సినిమాను, బాలకృష్ణ క(ఇ)ష్టపడి చేసిన నటనాకౌశలాన్ని దారుణంగా దెబ్బతీసింది.
ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే స్టార్ హీరో చక్రధర్(బాలకృష్ణ). అతన్ని అభిమానిస్తూ వెంటబడే (షీలా) అతనికి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తూంటుంది. అయితే అతని తల్లి( జయసుధ  )కి అలాంటివి గిట్టవు. ఆవిడకి తన కొడుకు పెద్ద మిలిట్రీ మేజర్ అయ్యి, దేశానికి సేవ చేయాలనే జీవితాశయం. ఈ స్ధితిలో చక్రధర్ కు కొందరు ఆర్మీ ఆఫీసర్స్ పరిచయమై తమ దగ్గరో అధ్బుతమైన కథ ఉందని చెప్తారు. కథ నచ్చితే ప్రీగా చేస్తానని మాట ఇచ్చిన చక్రధర్ కి ఆ కథని జితేంద్ర(మురళి మోహన్)అనే మిలిట్రీ ఆఫీసర్ నోటిగుండా వినటానకి రెడీ అవుతాడు. ఆ కథ ఆర్మీలో సిన్సియర్ ఆఫీసర్ మేజర్ జయసింహ(బాలకృష్ణ)కి చెందింది. కథ వింటున్న చక్రధర్ అందులో లీనమై తనను తాను జయసింహాగా ఊహించుకుంటాడు. ఆ తర్వాత నిజంగానే ఆ కథ జరిగిందని తెలుసుకుంటాడు. విన్న ఆ కథ ప్రకారం కొందరు కుట్రదారులు (సినిమా ఈ రేంజి పాత వాసనలుతో ఉంటుంది) వల్ల నష్టపోయి, దేశద్రోహిగా మిగిలిన జయసింహకు న్యాయం చేయాలనుకుంటాడు. అందుకోసం సినిమా నటుడు, జయసింహ పోలికలతో ఉన్న చక్రధర్ ఏం చేసాడు. ఈ కథకీ పరమవీరచక్ర బిరుదుకీ సంభందం ఏమిటీ అన్నది మిగతా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
బాలకృష్ణ చేత ఈ చిత్రం బొబ్బిలిపులికి సీక్వెల్ కాదు…రీమేక్ అంతకన్నా కాదు అని ప్రత్యేకంగా ఇంటర్వూల్లో చెప్పించిన దాసరి ఈ చిత్రాన్ని బొబ్బిలిపులి సీన్ తోనే మొదలెడతారు. అలాగే మేజర్ జయసింహ కథంతా విన్న హీరో చక్రధర్ కి ఊహించని విధంగా ఏదో ట్విస్ట్ వస్తుందని ఎన్నో సినిమాలు చూసిన సగటు ప్రేక్షకుడు ఎదురుస్తాడు. అయితే వారి ఊహకు అందనిరీతిలో అంతసీనెందుకు అన్నట్లుగా రొటీన్ గానే కథనం సా…గు..తూంటుంది. కొన్ని సార్లు చాలా మందికి విజయేంద్రవర్మ చిత్రం కూడా గుర్తుకు వచ్చి ఆ ప్లాపుకి కనెక్టు అయిపోయారు.
సినిమా ప్రారంభమైన చాలా సేపటికిగాని కథలోని సమస్యలోకి వెళ్ళకపోవటమే ఈ సినిమా కథకున్నప్రధాన సమస్య.ఎప్పటికో మురళిమోహన్ చెప్పే ప్లాష్ బ్యాక్ పూర్తి కావాలి, అప్పుడు గానీ మన హీరో చక్రధర్ చలనంలోకి వచ్చి విలన్స్ పనిపట్టడు. అప్పటివరకూ మనకెంత ఓపికకావాలి. అప్పటివరకూ ప్లాష్ బ్యాక్ లో కనపించే జయసింహకు సమస్యలు రావా అంటే కథ ప్రకారం చక్రధర్ కి సమస్య వచ్చి వాటిని ఫేస్ చేస్తేనే కదా కథనం రక్తి కట్టేది. ఇంతకు మించి రొటీన్ గా సాగే ఈ కథ, కథనాలను విశ్లేషించటానికి కూడాఏమీ లేదు.
అలాగే మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు కనపడి షాక్ ఇస్తాడు. మరో ప్రక్క కోడి రామకృష్ణ, బోయపాటి శ్రీను, జొన్నవిత్తుల, సింగీతం శ్రీనివాసరావు వంటి సినీ ప్రముఖులను చూపి ఆకట్టుకోవాలని చూడటం దాసరి వంటి మెగా(అప్పట్లో) దర్శకుడు ప్రయత్నించటం కూడా ఆశ్చర్యమనిపిస్తుంది. బాలకృష్ణతో కథకు సంభందం లేని వివిధ గెటప్స్, డైలాగులు, సెలబ్రేటీలను చూపటం ఇదంతా చూస్తుంటేనే ఏదో రకంగా ఒడ్డున పడాలని ప్రయత్నిచినట్లు స్పష్టంగా తెలిసిపోతూంటుంది. వీటిన్నట్టికీ తోడు హీరోయిన్స్ అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా…వీళ్ళలో ఒక్కరికీ సరైన పాత్ర, డైలాగులు, జస్టిఫికేషన్ ఉండదు. కేవలం బాలకృష్ణను ఎలా చూపాలా అని ఆలోచించి డిజైనా చేసినట్లుగా సినిమా అంతా జరుగుతూంటుంది.
ఇక సినిమాలో ప్లస్సులు లేవా అంటే…అది బాలకృష్ణే. ఆయన నటన, డైలాగులు చెప్పే తీరు సినిమా సినిమాకూ పదునెక్కుతోందని స్పష్టం చేస్తుందీ చిత్రం. అలాగే క్లైమాక్స్ లో కోర్టులో చెప్పే డైలాగ్స్ కూడా బావున్నాయి. అలీ, బ్రహ్మానందం చేసిన రోబో పేరడీ కామెడీ ఏ సి సెంటర్ల వారకన్నా ఎక్కాలేమో కానీ మిగతావారికి కష్టం. అదే దాసరి టార్గెట్ అయితే అంతవరకూ విజయం సాధించినట్లే. సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు, మురళి మోహన్, జయసుధ, రఘుబాబు వంటివారుకి పెద్ద పాత్రలు లేకపోయినా ఉన్నంతలో బాగా చేసారు. చాంతాడంత డైలాగులకు దాసరి నారాయణ రావు పెట్టింది పేరనే విషయం మరో మారు గుర్తుకు వస్తుంది. అయితే డైలాగులు కొన్ని చోట్ల బాగానే పేలాయి. అయితే ధియోటర్ నుంచి బయిటకు వచ్చాక ఏదీ గుర్తుండే అవకాశమేలేదు. ఇక పాటల విషయానికి వస్తే మణిశర్మ అప్పుడప్పుడూ ఎవియస్ చిత్రాలకు ఇచ్చిన సంగీతంలా నీరసంగా ఉంటుంది. నేపధ్య సంగీతమూ అదే రేంజిలో ఏడ్పిస్తుంది. కెమెరా, మేకప్, ఎడిటింగ్, ఆర్ట్ దాదాపు అన్ని విభాగాలు దాసరి గారి పురాతన దర్శకత్వానికి పోటీ పడి పనిచేసాయి.
పైనల్ గా ఈ చిత్రం బాలకృష్ణకు ఎలాంటి దర్శకులను, కథలను ఎంచుకోవాలి అన్న విషయంలో స్ఫష్టమైన ఆలోచనలు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సింహాతో పోల్చుకుంటే ఈ చిత్రం ఎక్కడ దెబ్బతిందో ఇట్టే కనిపెట్టేయచ్చు. అలాగే అదే సమయంలో దాసరిగారు ఇంత దారుణమైన ప్లాపులు ఇవ్వకుండా ఉండటానికి ఏకైక మార్గం కొంతకాలం పాటు దర్శకత్వానికి దూరంగా ఉండటమే బెస్ట్ అని ఈ చిత్రం చెప్తుంది. ఇక మనలాంటివారికి సింహా లాంటి హిట్ తర్వాత వచ్చే ప్రతీ చిత్రం సింహా కానక్కర్లేదని, ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని నిరూపిస్తుంది.
http://teluguratna.com/wp-content/uploads/2011/01/Fr11.gif

Sunday, January 9, 2011

గంభీర్‌కు గరిష్ట ధర

  • ఐపిఎల్‌ వేలంలో గంగూలీ, లారా, గేల్‌ పట్ల కానరాని ఆసక్తి
  • క్రీడాకారుల మ్యూజికల్‌ ఛైర్స్‌
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-4 టోర్నమెంట్‌కు కౌంట్‌డౌన్‌ క్రీడాకారుల వేలంతో శనివారం నాడిక్కడ ప్రారంభమైంది. ఐపిఎల్‌ కమిషనర్‌ చిరాయు అమిన్‌ అధ్యక్షతన తొలి రోజు జరిగిన వేలంలో భారత జట్టు ఓపెనర్‌ గౌతం గంభీర్‌ అగ్ర భాగాన నిలిచాడు. అతడ్ని కొల్‌కతా నైట్‌రైడర్స్‌ రికార్డు ధర 2.4 మిలియన్‌ డాలర్లకు 2.4 మిలియన్‌ డాలర్లకు, అంటే రు.11.04 కోట్లకు కొనుగోలు చేసింది. మొత్తం 353 మంది క్రీడాకారులు ఈ వేలంలో పాల్గొన్నారు. రెండు రోజులపాటు సాగే ఈ వేలం కార్యక్రమంలో తొలి రోజు సంచలనాలు నమో దయ్యాయి. గంభీర్‌కు అత్యధిక ధర పలకగా సౌరవ్‌ గంగూలీ, బ్రియాన్‌ లారా, క్రిస్‌ గేల్‌, మార్క్‌ బౌచర్‌ పట్ల ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి ప్రదర్శించ లేదు. ఈ కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగుతుంది.
గంభీర్‌పట్ల క్రేజ్‌
తొలి రోజు వేలంలో గౌతం గంభీర్‌ పట్ల ఫ్రాంఛైజీలు అపరిమితమైన క్రేజ్‌ ప్రదర్శిం చాయి. తొలిగా పూనే, ముంబయి ఇండియన్స్‌ అతడి కోసం పోటీపడ్డాయి. అతడి ధర మిలియన్‌ డాలర్‌ మార్క్‌ దాటిన తరువాత అప్పటివరకు మౌనంగా ఉన్న కొల్‌కతా నైట్‌రైడర్స్‌ రంగంలో ప్రవేశించింది. అంతకుముందు రాజస్థాన్‌ రాయల్స్‌ కూడా అతడి కోసం ప్రయత్నించింది. తొలి రోజు వేలం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. తొలిగా గంభీర్‌ను కొల్‌కతా నైట్‌ రైడర్స్‌ కొనుగోలు చేయడంతో ఈ కార్యక్రమం ఆరంభమైంది. గంభీర్‌కు ఎంత క్రేజ్‌ ఉన్నదీ ఈ వేలం కార్యక్రమం చాటి చెప్పింది. భారత క్రీడాకారులపట్ల అత్యంత ఆకర్షణ వ్యక్తమైది. ముగ్గురు క్రికెటర్లు రెండు మిలియన్ల ధర పలికారు. కెవిన్‌ పీటర్సన్‌, ఆండ్రూ ఫ్లింటాఫ్‌ కంటే గంభీర్‌ ఎక్కువ ధర పలికాడు. కొల్‌కతా నైట్‌ రైడర్స్‌ సహ యజమాని, బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. గంభీర్‌తో పాటు హార్డ్‌హిట్టింగ్‌ ఆల్‌రౌండర్లు యూసుఫ్‌ పఠాన్‌(రు.9.66 కోట్లు), జాక్స్‌ కల్లిస్‌(రు.5.06 కోట్లు)ను కొల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫ్రాంఛైజర్లు కొనుగోలు చేసారు. గత సీజన్‌లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ కెప్టెన్‌గా ఉన్న గంభీర్‌ మౌలిక ధర రు.92 లక్షల కంటే పన్నెండు రెట్లు అధిక ధర పలికాడు. భారత్‌కు చెందిన యూసుఫ్‌ పఠాన్‌, రోహిత్‌ శర్మ (రెండు మిలియన్లు), రాబిన్‌ ఊతప్ప కూడా రెండు మిలియన్ల మార్క్‌ను దాటారు. భారత జట్టులో స్థానం కోల్పోవడంలో విఫలమవుతున్న ఇర్ఫాన్‌ పఠాన్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తీసుకకుంది. అతడికి ఎవరూ ఊహించని రీతిలో రు.8.74 కోట్ల ధర పలికింది. భారత క్రీడాకారులపై ఎక్కువ ధర పెట్టేందుకు ఫ్రాంఛైజీలు పోటీపడ్డ వైనం తొలి రోజు వేలం కార్యక్రమంలో ప్రస్ఫుటమైంది. విదేశీ క్రీడాకారుల్లో మహేలా జయవర్థనే మంచి ధర పలికాడు. అతడ్ని కొత్తగా ఐపిఎల్‌ బరిలో దిగుతున్న కోచ్చి జట్టు రు.6.90 కోట్లకు కొనుగోలు చేసింది.
బెంగుళూరు జట్టులో జహీర్‌
భారత జట్టులో ప్రధాన స్ట్రైక్‌ బౌలర్‌గా మారిన జహీర్‌ ఖాన్‌ పట్ల ముంబయి ఇండియన్స్‌ ఎందుకు ఆసక్తి వ్యక్తం చెయ్యలేదో అర్థం కాలేదు. అతడ్ని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 900,000 డాలర్లకు కొనుగోలు చేసింది. శ్రీలంక ఓపెనర్‌ తిలకరత్నే దిల్షన్‌కు 650,000 డాలర్ల ధర పలికింది. దక్షిణాఫ్రికా జట్టులో డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌, ఇటీవలి కాలం వరకు ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్‌ వన్‌గా ఉన్న డివిల్లీర్స్‌ను విజయ మాల్యా యాజమాన్యంలోని జట్టు సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ డేనియల్‌ వెట్టోరీని కూడా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది. రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు రాస్‌ టేలర్‌ను రు.4.6 కోట్లకు సొంతం చేసుకుంది.కెవిన్‌ పీటర్సన్‌ను డక్కన్‌ ఛార్జర్స్‌ 650,000 డాలర్లకు కొనుగోలు చేసింది. తొలి సీజన్‌లో గరిష్ట ధర పలికిన ఆండ్రూ సైమండ్స్‌ను ముంబయి ఇండియన్స్‌ 850,000 డాలర్లకు కొనుగోలు చేసింది.
కోచ్చి జట్టులో లక్ష్మణ్‌
వివిఎస్‌ లక్ష్మణ్‌, శ్రీశాంత్‌, రుద్రప్రతాప్‌ సింగ్‌ (ఆర్‌పిసింగ్‌), బ్రెండన్‌ మెక్‌కలమ్‌, మహేలా జయవర్ధనేలను కోచ్చి కొనుగోలు చేసింది. మెక్‌కలమ్‌ 475,000 డాలర్లకే అందుబాటులోకి వచ్చాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్‌ గ్రీమ్‌ స్మిత్‌ను సహారా పూనే వారియర్స్‌ 500,000 డాలర్లకే కొనుగోలు చేసింది. కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ కెప్టెన్‌ కుమార సంగక్కర, జయవర్ధనే ఈ సారి ఆ జట్టులో ఆడటం లేదు.సంగక్కరను డక్కన్‌ ఛార్జర్స్‌, జయవర్ధనేను కోచ్చి కొనుగోలు చేసాయి. డక్కన్‌ ఛార్జర్స్‌ కెప్టెన్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ పట్ల ఆ జట్టు సానుకూలత వ్యక్తం చెయ్యలేదు. అతడ్ని పూనే వేలం పాడింది. యువ క్రీడాకారుడు సౌరభ్‌ తివారీని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు రు.7.36 కోట్లకు సొంతం ం చేసుకుంది.
శనివారం అత్యంత అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ నటీమణులు ప్రీతీ జింటా, శిల్పాశెట్టి, లిక్కర్‌ బ్యారన్‌ విజరు మాల్యా, అతడి కుమారుడు సిద్థార్థ, నీతా అంబానీ, నస్లీ వాడియా ఆకర్షణగా నిలిచారు. గత టోర్నమెంట్లలో ఆడిన అనిల్‌ కుంబ్లే, స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, డరేన్‌ లెV్‌ామన్‌ ఈ కార్యక్రమంలో సహకరించారు. కుంబ్లే, పాంటింగ్‌ ఈ టోర్నమెంట్‌కు దూరమయ్యారు. అంతర్జా తీయ జట్టులో స్థానం సంపాదించలేకపోతున్న రాబిన్‌ ఊతప్పను రు.9.66 కోట్లకు సహారా పూనే వారియర్స్‌ కొను గోలు చేసింది. ఇంతకుముందు కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ జట్టులో ఆడిన యువరాజ్‌ సింగ్‌ను కూడా ఆ జట్టు తీసు కుంది. అతడికి 8.28 కోట్ల రూపాయల ధరను నిర్ణ యించింది. రోహిత్‌ శర్మకు కూడా అనూహ్యంగా భారీ ధర పలికింది. అతడ్ని రు.9.2 కోట్లకు ముంబయి ఇండియన్స్‌ వేలం పాడింది.
గంగూలీ, హతవిథీ!
కొల్‌కతా నైట్‌ రైడర్స్‌ మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ, ప్రధాన ఆకర్షణ కానున్నాడని అందరూ భావించిన వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ బ్రియాన్‌ లారా, వెస్టిండీస్‌ కెప్టెన్‌ క్రిస్‌ గేల్‌ పట్ల ఫ్రాంఛైజీలెవ్వరూ ఆసక్తి చూపకపోవడం తొలి రోజు సంచలనం సృష్టించింది. వీరితో పాటు టి20 స్పెషలిస్ట్‌లుగా పేరుగాంచిన జెస్సీ రైడర్‌, హెర్షల్లీ గిబ్స్‌, మార్క్‌ బౌచర్‌, గ్రీమ్‌ స్వాన్‌లను ఎవరూ కొనుగోలు చెయ్యలేదు. మొదటి రౌండ్‌ ముగిసిన తరువాత వీరిని ఎవరైనా ఫ్రాంఛైజీకొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పటికీ తొలి రౌండ్‌లో అవకాశం లభించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వారి పట్ల తగ్గిపోయిన క్రేజ్‌కు ఇది తార్కాణంగా నిలుస్తుంది.

తీరని సెంచరీల దాహాం


పదహారేళ్ల చిరుప్రాయంలో అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించిన సచిన్‌ టెండూల్కర్‌ వటుడింతై అన్న చందాన క్రమంగా తన ప్రాభవాన్ని మెరుగుపరచుకుని ఆధునిక డాన్‌ బ్రాడ్‌మన్‌ అని పిలిపించుకునే స్థాయికి ఎదిగాడు. 21సంవత్సరాల సుదీర్ఘ క్రికెట్‌ జీవితంలో టెస్టుల్లో(51), వన్డేల్లో(46) శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. 37 ఏళ్ల వయసులోనూ అలుపన్నది ఎరగక సెంచరీలమీద సెంచరీలు కొడుతూనే ఉన్నాడు. తన పరుగుల దాహం తీరదని చాటుకున్నాడు. వ్యక్తిగతంగా, జట్టు సభ్యునిగా భారత్‌కు ప్రత్యేకతను ఆపాదిస్తున్నాడు. వర్తమాన క్రికెట్‌ జగతి సమీప భవిష్యత్‌లో తనను మరే ఇతర క్రికెటర్‌ అందుకోజాలని రికార్డుల శిఖరాగ్రాన నిలిచాడు. ప్రపంచ క్రికెట్‌లో భారత్‌ నెంబర్‌ 1 స్థానంలో భాసించడం వెనుక సచిన్‌ అందిస్తున్న అమూల్యమైన సేవలు కీలకమనడంలో సందేహం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో గత రెండు దశాబ్దాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. మారిన, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా క్రీడారంగంలో ఎదురయ్యే సవాళ్లను సవాలు అధిగమించడం ద్వారా సచిన్‌ అటు టెస్టుల్లోనూ, ఇటు వన్డేల్లోనూ అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగానిగా అగ్రస్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ టెస్టుల్లో 51సెంచరీలు, వన్డేల్లో 46 వెరసి 97సెంచరీలు సాధించిన సచిన్‌ ఇంకా ఆ మూడు శతకాలు ఎపుడెపుడు పూర్తి చేస్తాడా ...అంతర్జాతీయ క్రికెట్‌లో నూరు నూర్లు సాధించిన జగజ్జెట్టి గా ఎపుడు నిలుస్తాడా అని క్రీడాభిమానులు ఎదురుచూస్తున్నారనడంలో సందేహం లేదు. ఈ ఎదురు చూపుల వేళ రాబోయే ప్రపంచకప్‌ను భారత్‌కు సాధించి పెట్టడమే తన మదిలోని చిరస్మరణీయ వాంఛగా మాస్టర్‌ సచిన్‌ ప్రకటించడం గమనార్హం. సచిన్‌ పరుగుల వేటకు ప్రస్తుతం దక్షిణాఫ్రికా వేదికగా నిలిచింది. గడచిన 12మాసాల్లోనే దక్షిణాఫ్రికా మీద టెస్టుల్లో నాలుగు శతకాలు, వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించాడు. కాగా ఆస్ట్రేలియా మీద అత్యధికంగా 11 సెంచరీలు, శ్రీలంక మీద తొమ్మిది, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ల మీద ఏడేసి, బంగ్లాదేశ్‌ మీద ఐదు, న్యూజిలాండ్‌ మీద నాలుగు, వెస్టిండీస్‌, జింబాబ్వేల మీద మూడేస,ి పాకిస్తాన్‌ మీద రెండు శతకాలు సాధించాడు. వన్డేల విషయానికి వస్తే ఆస్ట్రేలియానే అభిమాన ప్రత్యర్ధిగా ఉంది. వన్డేల్లో ఆస్ట్రేలియా మీద సచిన్‌ తొమ్మిది శతకాలు సాధించడమే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. శ్రీలంక మీద ఎనిమిది, న్యూజిలాండ్‌ మీద ఏడు, పాకిస్తాన్‌, జింబాబ్వేల మీద ఐదు చొప్పున, దక్షిణాఫ్రికా, కెన్యాల మీద నాలుగు చొప్పున, వెస్టిండీస్‌ మీద రెండు, ఇంగ్లండ్‌, నమీబియాల మీద ఒక్కో శతకం చొప్పున సాధించాడు. 1990 ఆగస్టు 14న ప్రారంభమైన సచిన్‌ జోరు 2011లోనూ కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

టెస్టుల్లో శతకాల వివరాలు
1. 1990 ఆగస్టు 14న మాంచెస్టర్‌ ట్రఫార్డ్‌ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ 119 నాటవుట్‌.
2. 1992 జనవరి ఆరు..ఆస్ట్రేలియా సిడ్నీ మైదానం...148నాటవుట్‌
3. 1992 ఫిబ్రవరి మూడు..పెర్త్‌ వాకా మైదానం ..114
4. 1992 నవంబరు 28న దక్షిణ ఆఫ్రిక జోహనెస్‌బర్గ్‌ వాండరర్స్‌ స్టేడియం...111
5. 1993 ఫిబ్రవరి 12 భారత్‌లోని చెన్నరు చిదంబరం స్టేడియం. .ఇంగ్లండ్‌ మీద 165.
6. 1993 జులై 31 శ్రీలంక..కొలంబో మైదానం...104నాటవుట్‌
7. 1994 జనవరి 19 భారత్‌లోని లక్నో కెడిసింగ్‌ స్టేడియం..శ్రీలంక మీద 142.
8. 1994డిసెంబరు రెండు..నాగపూర్‌ విదర్భ క్రికెట్‌ సంఘం మైదానం..వెస్టిండీస్‌ మీద 179
9. 1996 బర్మింగ్‌హామ్‌ ఎడ్జ్‌బాస్టన్‌ మైదానం ఇంగ్లండ్‌ మీద 122
10. 1996 జులై ఐదున నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌ బ్రిడ్జిలో ఇంగ్లండ్‌ మీద 177
11. 1997 జనవరి నాలుగు..కేప్‌టౌన్‌లో న్యూలాండ్స్‌ మైదానం.. దక్షిణ ఆఫ్రికా మీద 169
12. 1997 ఆగస్టు మూడు...ప్రేమదాసస్టేడియం..శ్రీలంక మీద 143
13. 1997 ఆగస్టు 11కొలంబో సింహళీల స్పోర్ట్స్‌క్లబ్‌..శ్రీలంక మీద 139
14. 1998 మార్చి 9న చెన్నరు చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియా మీద 155నాటవుట్‌
16. 1998 మార్చి 26న బెంగళూర్‌ చిన్నస్వామి స్టేడియం ఆస్ట్రేలియా మీద 177
17. 1998 డిసెంబరు 29న వెల్లింగ్టన్‌ బేసిన్‌ రిజర్వు..న్యూజిలాండ్‌ మీద 113
18. 1999 జనవరి 31న చెన్నరులో పాకిస్తాన్‌ మీద 136పరుగులు
19. 1999ఫిబ్రవరి 28న కొలంబోలో శ్రీలంక మీద 124నాటవుట్‌
20. 1999 అక్టోబరు 13న మొహాలీ పంజాబ్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌ మీద 126నాటవుట్‌
21. 1999 అహ్మదాబాద్‌ సర్దార్‌ పటేల్‌ స్టేడియం న్యూజిలాండ్‌ మీద 217
22. 1999 28 మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంలో ఆస్ట్రేలియా మీద 116
23. 2000 నవంబరు 21న న్యూఢిల్లీ ఫిరోజ్‌ షా కోట్ల మైదానం..జింబాబ్వే మీద 122పరుగులు
24. 2000 నవంబరు 26న విదర్భ క్రికెట్‌ మైదానం..జింబాబ్వే మీద 201నాటవుట్‌
25. 2001 చెన్నరు చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియా మీద 126పరుగులు
26. 2001 నవంబరు 3శ్రీ బ్లోయిమ్‌ఫోంటేన్‌ మైదానంలో దక్షిణ ఆఫ్రికా మీద 155పరుగులు
27. 2001 డిసెంబరు 13న అహ్మదాబాద్‌ పటేల్‌ స్టేడియం. ఇంగ్లండ్‌ మీద 103 పరుగులు
28. 2002 ఫిబ్రవరి 24 నాగపూర్‌ విదర్భమైదానం జింబాబ్వే మీద 176
29. 2002 ఏప్రిల్‌ 20పోర్టాఫ్‌ స్పెయిన్‌ క్వీన్ప్‌ పార్క్‌ ఓవల్‌లో వెస్టిండీస్‌ మీద 117పరుగులు
30. 2002 ఆగస్టు 23 లీడ్స్‌లో ఇంగ్లండ్‌ మీద 193 పరుగులు
31. 2002 నవంబరు మూడు కోల్‌కత ఈడెన్‌గార్డెన్స్‌లో వెస్టిండీస్‌ మీద 176 పరుగులు
32. 2004 జనవరి సిడ్నీ మైదానం ..ఆస్ట్రేలియా మీద 241 నాటవుట్‌
33. 2004మార్చి 29 ముల్తాన్‌ మైదానం ..పాకిస్తాన్‌ మీద 194నాటవుట్‌
34. 2004డిసెంబరు 12న ఢాకా.వంగబంధుస్టేడియం.. బంగ్లాదేశ్‌ మీద 248 నాటవుట్‌
35. 2005 డిసెంబరు 22న న్యూఢిల్లీ ఫిరోజ్‌షా కోట్ల మైదనంలో శ్రీలంక మీద 109
36. 2007 మే 19న చిట్టగాంగ్‌ వీర్‌ శ్రేష్ట మైదానంలో బంగ్లాదేశ్‌ మీద 101పరుగులు
37. 2007 మే 26న మిర్పూర్‌ బంగ్లా నేషనల్‌ స్టేడియంలో బంగ్లా మీద 122నాటవుట్‌
38. 2008 జనవరి నాలుగున సిడ్నీలో ఆస్ట్రేలియా మీద 154నాటవుట్‌
39. 2008 జనవరి 25న అడిలైడ్‌ ఓవల్‌ మైదానం.. ఆస్ట్రేలియా మీద 153పరుగులు
40. 2008 నవంబరు ఆరున నాగపూర్‌లో ఆస్ట్రేలియా మీద 109పరుగులు
41. 2008 డిసెంబరు 15న చెన్నరులో ఇంగ్లండ్‌ మీద 103నాటవుట్‌
42. 2009 మార్చి 20న హామిల్టన్‌ సెడాన్‌ పార్క్‌లో న్యూజిలాండ్‌ మీదద 160 పరుగులు
43. 2009 నవంబరు 20న అహ్మదాబాద్‌ పటేల్‌ స్టేడియంలో శ్రీలంక మీద 100నాటవుట్‌
44. 2010 జనవరి 18 చిట్టగాంగ్‌ జోహుర్‌ స్టేడియంలో బంగ్లా మీద 105 నాటవుట్‌
45. 2010 జనవరి 25న బంగ్లా మీదనే 143పరుగులు
46. 2010 ఫిబ్రవరి 9న నాగపూర్‌లో దక్షిణ ఆఫ్రికా మీద 100
47. 2010 ఫిబ్రవరి 15న కోల్‌కత ఈడెన్‌గార్డెన్స్‌లో దక్షిణ ఆఫ్రికా మీద 106పరుగులు
48. 2010 జులై 28న కొలంబొలో శ్రీలంక మీద 203పరుగులు
49. 2010 అక్టోబరు 11న బెంగళూరులో ఆస్ట్రేలియా మీద 214పరుగులు
50. 2010 డిసెంబరు 19న సెంచూరియన్‌లోని సూపర్‌ స్పోర్ట్‌ పార్క్‌లో దక్షిణ ఆఫ్రికా మీద 111నాటవుట్‌
51. 2011 జనవరి నాలుగు.. కేప్‌టౌన్‌లో దక్షిణ ఆఫ్రికా మీద శతకం
వన్డేల్లో శతకాల వివరాలు
1. 1994 సెప్టెంబరు 19 కొలంబోప్రేమదాస స్టేడియం ఆస్ట్రేలియా మీద 110పరుగులు
2. 2994అక్టోబరు 28న వదోదరలో న్యూజిలాండ్‌ మీద 115పరుగులు
3.1994 నవంబరు 11న జైపూర్‌ సవాయి మాన్‌సింగ్‌ స్టేడియంలో వెస్టిండీస్‌ మీద 105పరుగులు
4.1995 ఏప్రిల్‌ 9న షార్జాలో శ్రీలంక మీద 112నాటవుట్‌
5.1996 ఫిబ్రవరి 18న కటక్‌లో కెన్యా మీద 127 నాటవుట్‌
6.1996 మార్చి రెండున న్యూఢిల్లీలో శ్రీలంక మీద 137పరుగులు
7.1996 ఏప్రిల్‌ ఐదున సింగపూర్‌ పడాంగ్‌మైదానంలో పాకిస్తాన్‌ మీద 100పరుగులు
8. 1996 ఏప్రిల్‌ 15 షార్జాలో పాకిస్తాన్‌ మీద 118పరుగులు
9. 1996 కొలంబొలో శ్రీలంక మీద 110 పరుగులు
10. 1996 డిసెంబరు 14న ముంబయి వాంఖడే స్టేడియంలో దక్షిణ ఆఫ్రికా మీద 114పరుగులు
11.1997 ఫిబ్రవరి 9న బినోనీ విలోమూర్‌ పార్క్‌లో జింబాబ్వే మీద 104
12.1997 మే 14న బెంగళూరులో న్యూజిలాండ్‌ మీద 117
13. 1998 ఏప్రిల్‌ఏడు కాన్పూర్‌ గ్రీన్‌పార్క్‌ స్టేడియంలో ఆస్ట్రేలియా మీద 100 పరుగులు
14. 1998 ఏప్రిల్‌ 22న షార్జాలో ఆస్ట్రేలియా మీద 143పరుగులు
15. 1998 ఏప్రిల్‌ 24న షార్జాలోనే అదే ఆస్ట్రేలియా జట్టు మీద 134
16. 1998 మే 31న కోల్‌కత ఈడెన్‌లో కెన్యా మీద 100పరుగులు
17. 1998 జులై ఏడున కొలంబోలో శ్రీలంక మీద 128పరుగులు
18. 1998 సెప్టెంబరు 26న బులావాయోలో జింబాబ్వే మీద 127నాటవుట్‌
19. 1998 అక్టోబరు 28న ఢాకాలో ఆస్ట్రేలియా మీద 141పరుగులు
20. 1998 నవంబరు ఎనిమిది షార్జాలో జింబాబ్వే మీద 118నాటవుట్‌
21. 1998 నవంబరు 13న షార్జాలో జింబాబ్వే మీదనే 124నాటవుట్‌
22. 1999 మే 23న బ్రిస్టల్‌లో కెన్యా మీద 140
23. 1999 ఆగస్టు 29న కొలంబోలో శ్రీలంక మీద 120పరుగులు
24. 1999 నవంబరు 8న హైదరాబాద్‌ లాల్‌బహదూర్‌శాస్త్రి స్టేడియంలో న్యూజిలాండ్‌ మీద 186నాటవుట్‌
25. 2000 మార్చి 17న వదోదరలో దక్షిణ ఆఫ్రికా మీద 122పరుగులు
26. 2000 అక్టోబరు 20న షార్జాలో శ్రీలంక మీద 101పరుగులు
27. 2000 డిసెంబరు 8న జోధపూర్‌లో జింబాబ్వే మీద 146పరుగులు
28. 2001 మార్చి 31న ఇండోర్‌లో ఆస్ట్రేలియా మీద 139పరుగులు
29. 2001 హరారేలో వెస్టిండీస్‌ మీద 122నాటవుట్‌
30. 2001 అక్టోబరు 5న జోహనెస్‌బర్గ్‌లో దక్షిణ ఆఫ్రికా మీద 101
31. 2001 అక్టోబరు 24న పార్ల్‌ బొలాండ్‌పార్క్‌లో కెన్యా మీద 146
32. 2002 జులై నాలుగున రివర్సీమైదానంలో ఇంగ్లండ్‌ మీద 105నాటవుట్‌
33. 2002 జులై 11 బ్రిస్టల్‌లో శ్రీలంక మీద 113
34. 2003 ఫిబ్రవరి 23న పీటర్‌మారిట్జ్‌బర్గ్‌ ఓవల్‌మైదానంలో నమీబియా మీద 152పరుగులు
35. 2003 అక్టోబరు 26న గ్వాలియర్‌ రూప్‌సింగ్‌స్టేడియంలో ఆస్ట్రేలియా మీద 100పరుగులు
36. 2003 నవంబరు 15న హైదరాబాద్‌ శాస్త్రి స్టేడియంలో న్యూజిలాండ్‌ మీద 102పరుగులు
37. 2004 మార్చి 16న రావల్పిండి మైదానంలో పాకిస్తాన్‌ మీద 141
38. 2005 ఏప్రిల్‌ 12న మోటెరా పటేల్‌ స్టేడియంలో పాకిస్తాన్‌ మీద 123
39. 2006 ఫిబ్రవరి 6న పెషావర్‌లో పాకిస్తాన్‌ మీద 100 పరుగులు
40. 2006 సెప్టెంబరు14న కౌలాలంపూర్‌లో వెస్టిండీస్‌ మీద 141నాటవుట్‌
41. 2007 జనవరి 31న వదోదరలో వెస్టిండీస్‌ మీద 100నాటవుట్‌
42. 2008 మార్చి రెండున సిడ్నీలో ఆస్ట్రేలియా మీద 117నాటవుట్‌
43. 2009 మార్చి 8న క్రీస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్‌ మీద 163పరుగులు
44. 2009 సెప్టెంబరు 14న కొలంబొలో శ్రీలంక మీద 138పరుగులు
45. 2009 నవంబరు5న హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఆస్ట్రేలియా మీద 175
46. 2010 ఫిబ్రవరి 24న గ్వాలియర్‌లో దక్షిణ ఆఫ్రికా మీద 200 నాటవుట్‌

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పదా?

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెల్లడైన తరువాత తెలంగాణాలో ఊపందుకుంటున్న ఆందోళనలు సీమాంధ్రకు విస్తరించి రాష్ట్ర ప్రభుత్వం అదుపుచేయలేని దశకు చేరుకుంటే రాష్ట్రపతి పాలన తప్పక పోవచ్చు.శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని అంశాలు వెలుగులోకి వచ్చిన తరువాత తెలంగాణ ప్రజా ప్రతినిధుల్లో కనిపిస్తున్న ఆందోళన సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల్లో లేదు.తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే తప్ప నియోజక వర్గాలలో అడుగుపెట్టలేమని తెలంగాణ ప్రాంత ఎంపీల్లో అత్యధికులు హైకమాండ్‌కు స్పష్టం చేస్తూ, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టకపోతే ఎంపీ సభ్యత్వాలకు రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఒక వేళ కేంద్రం తెలంగాణ వైపు మొగ్గు చూపితే అటూ సీమాంధ్రల్లో సైతం ఆందోళనలు చెలరేగే అవకాశం ఉంది.ఎంపీలతోపాటు ఎమ్మెల్యేలూ రాజీనామా బాట పడితే ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుంది. రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా చూడడానికి మూడు ప్రాంతాలకు చెందిన ఎంపీలతో మరోవిడత చర్చలు జరపాలని అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది.ఒక వేళ చర్చలు సఫలం కాక పోతే రాష్ట్రపతి పాలన తప్పక పోవచ్చనే వాదనలు సర్వత్ర వినిపిస్తున్నాయి.శ్రీకృష్ణ కమిటీ నివేదిక అమలుపై అన్ని విషయాలను కూలంకశంగా చర్చించి చిట్టచివరి అస్త్రంగా రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టే దిశలో కేంద్రం అన్ని అంశాలను అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Wednesday, January 5, 2011

చెయ్యెత్తి జై కొట్టు, తెలుగోడు!

24 గంటల ఛానెళ్ల యుగంలో గడువులూ, ఉత్కంఠలూ కీలకం. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించే డిసెంబరు 31 చుట్టూ బోలెడు కథ నడిచిన తర్వాత జనవరి 6 ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఇంటర్‌ నెట్‌లో విడుదల చేయదగిన లేదా టపాలో పంపదగిన ఆ నివేదికపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కేంద్రమూ నాటకీయత కొనసాగించింది. విమర్శలూ వివాదాల తర్వాత ఇప్పుడు రావడం రాకపోవడం ఒకరా ఇద్దరా తేల్చుకోవడం అంతా సదరు పార్టీల ఇష్టమేనని ప్రకటిస్తున్నది. నివేదిక ఇవ్వడం తప్ప చేసేదేమీ వుండదనిచల్లగా సెలవిస్తున్నది. కేంద్ర రాష్ట్రాలను పాలించే కాంగ్రెస్‌ నిజంగా అంత నిష్కామ కర్మగా వ్యవహరించి వుంటే ఈ అనిశ్చితి ఇంత కాలం కొనసాగేదే కాదు. ఇప్పుడు అది సమసిపోయే సూచనలూ
లేవు. ఎందుకంటే ప్రధాన పక్షాలు అనిశ్చితికి మూలమైన అవకాశవాద రాజకీయాలను వదులుకున్న దాఖలాలు లేవు. తను నియమించిన కమిటీ నివేదికను ముందు తనుగా పరిశీలించి అభిప్రాయాలతో ముందుకు రావలసిన కేంద్రం ఆ బాధ్యతను రాష్ట్రంలోని రాజకీయ పక్షాలపై నెట్టి వేయడంలో కనిపించేది స్వచర్మ పరిరక్షణా తంత్రం మాత్రమే. పదే పదే హౌం మంత్రి చిదంబరం ఈ సమస్యకు పరిష్కారం రాష్ట్రంలోని రాజకీయ పక్షాల చేతుల్లోనే వుందని చెప్పడం రాజ్యాంగాన్ని వెక్కిరిస్తున్నది. ఒక దశలో జస్టిస్‌ శ్రీకృష్ణ కూడా విభేదించిన ఈ అభిప్రాయాన్ని పునరుద్ఘాటించడంలో చిదంబర రహస్యం రాజకీయ ప్రయోజనాల పరిరక్షణే. తెలుగు దేశం కూడా ద్వంద్వ భాషణ వ్యూహానికి డిటో అనడం వూహించిందే. ఈ విషయంలో తెలుగుదేశంపై దాడి కేంద్రీకరించే టిఆర్‌ఎస్‌ నేతలు ముందే ఢిల్లీ సమావేశాన్ని బహిష్కరించడం ద్వారా తామే దానికి అవకాశమిచ్చారు.
శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే పరిష్కారం ఏమీ వుండదని మొదటి నుంచి చెప్పిన నాయకులు తీరా ఆ ఘడియ వచ్చాక అనుకోనిది జరిగినట్టు స్పందించడంలో అర్థం లేదు. ఏది ఏమైనా ఆ నివేదిక ఏకపక్షంగా వుండే అవకాశమూ వుండదు. ఎందుకంటే విచారణాంశాలలో సకల ప్రాంతాల సమగ్రాభివృద్ధికి సూచనలు చేయమని వుంది. విభజన, అవిభాజ్యత ఆందోళనలను పరిశీలించాలని వుంది. అందుకే ఆ నివేదక తెలంగాణా విభజనకు అనుకూలంగా వుండక పోవచ్చన్న మాట విభజన వాదులు ముందే చెబుతున్నారు. తమ పోరాటం దీర్ఘకాలం కొనసాగుతుందని చెప్పడం ద్వారా టిఆర్‌ఎస్‌ నేతలు కూడా దాన్నే ప్రతిధ్వనిస్తూ అదే సమయంలో దీర్ఘకాలం అంటే కొన్ని నెలలు మాత్రమేనని వివరణనిస్తున్నారు. సీమాంధ్ర జెఎసి కన్వీనర్‌ కూడా తమకు అనుకూలంగా లేకపోతే ప్రజా ప్రతినిధులు రాజినామా చేయాలని పిలుపునిస్తున్నారు. ఏతా వాతా ఏడాది తర్వాత మళ్లీ అనిశ్చిత పర్వమే సాక్షాత్కరిస్తున్నది.కనీసం అశాంతిని అరికట్టేందుకైనా అధినేతలు యత్నిస్తారా అని అశేష జనం నిశితంగా చూస్తున్నారు. ఈ ప్రతిస్పందనలేవీ అనుకోనివి కానప్పటికీ వీటన్నిటి మధ్యనా కేంద్రం తీసుకున్న వైఖరి మాత్రం వారిలో సందేహాలు పెంచుతున్నది. ఏ రాష్ట్ర సమస్యను ఆ రాష్ట్రానికి చెందిన పక్షాలకే వదిలేయడం అన్న సూత్రం రాజకీయంగానే గాక రాజ్యాంగ రీత్యా కూడా ప్రహసన ప్రాయమే తప్ప ప్రజాస్వామికం కాదు. అనుకూలమైనా ప్రతికూలమైనా ఒక వైఖరిని ప్రకటించి పర్యవసానాలను రాజకీయంగా ఎదుర్కోవడానికి సిద్ధం కావాలే తప్ప ఎడతెగని అనిశ్చితి తెలుగు ప్రజలు హర్షించేది కాదు.

ఈ సమావేశానికి ఒకరు వెళ్లాలా ఇద్దరా అన్న చర్చ, ఆ కారణంగా సమావేశాన్ని బహిష్కరించడం అనివార్యమైన ఎత్తుగడలు మాత్రమే. వెళ్లేది ఇద్దరైనా ఒకేమాట చెప్పొచ్చు, ఒకరే వెళ్లి వంద రకాలుగా మాట్టాడనూ వచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా పార్టీలకు కావలసింది రాజకీయ లాభ నష్టాలతో నిమిత్తం లేనివిధాన స్పష్టత, విధానం సరైందనుకుంటే నష్టమైనా భరించాలి, సరైంది కాకపోతే లాభమైనా వదులుకోవాలి. గతంలో సిపిఎం(మరో విధంగా మజ్లిస్‌) తప్ప ఇతర రాజకీయ శక్తుల్లో రాజకీయ గజిబిజి వుండింది. శ్రీకృష్ణ కమిటీకి నివేదికలిచ్చినప్పుడు ఆయన ప్రశ్నలు జవాబుల కార్యక్రమంలో ఈ గందరగోళం బహిర్గతమైంది. సిపిఐ, బిజెపిలు, టిఆర్‌ఎస్‌ విభజనను బలపర్చినా కాంగ్రెస్‌ తెలుగు దేశం ద్వంద్వ రాగం వినిపిస్తూనే వున్నాయి. కేంద్రం వైఖరికి కట్టుబడి వుంటామనేది రాష్ట్ర మంత్రివర్గ పల్లవి కాగా కేంద్రం ఏమీ తేల్చబోవడం లేదు. దీనిపై జనం దృష్టిని ఆకర్షించేందుకు హడావుడి చేస్తున్న తమ ప్రతినిధులకు గప్‌చిప్‌ సంజ్ఞలు పంపుతున్నది. అరవై డెబ్బై ఏళ్ల కిందట రాష్ట్ర ఏర్పాటు సందర్భంలోనే కాంగ్రెస్‌ నేతలు వేర్వేరు గొంతులతో మాట్టాడారు. ఆ తర్వాత కూడా వివిధ ప్రాంతాలలో విభజన వాదాలను లేవనెత్తి రెచ్చగొట్టడం తర్వాత సర్దుకోవడంలో గొప్ప చాతుర్యం ప్రదర్శించారు. ఈ ఎత్తుగడనే అనుసరించబోయిన తెలుగు దేశం అంత అనుభవం లేకపోవడం వల్ల సంకట స్థితిలో పడింది. ఈ రెంటికీ మధ్య టిఆర్‌ఎస్‌ కూడా వైరుధ్యాలనుంచి బయిట పడలేకపోతున్నది. 'తెలంగాణాకు అనుకూలమైతే' అన్న మాట జోడిస్తున్నప్పటికీ కాంగ్రెస్‌ను బలోపేతం చేయడం, సోనియా నాయకత్వంలో విలీనం కావడం వంటి మాటలు, జగన్‌ విజయావకాశాల గురించిన సానుకూల వ్యాఖ్యలు భిన్న సంకేతాలిస్తున్నాయి. ఎవరి వుచ్చులో ఎవరు పడుతున్నారు, పడేస్తున్నారు అన్నది నేడు కాకపోతే రేపైనా తెలియక పోదు. తెలుగుదేశం నుంచి టిఆర్‌ఎస్‌లోకి భారీగ వలసలు జరుగుతాయన్న వూహలు ఏ మేరకు నిజమవుతాయో కూడా వేచి చూడాల్సిందే. లెక్కకు మిక్కుటమైన జెఎసిల తీరు తెన్నులు ఎలా వుంటాయన్నది మరో ప్రశ్న. ఒక ప్రాంతంలో పరిస్థితికి మరో వైపున పాలక పక్షాల నేతలు ఎలాటి ప్రతి స్పందన పెంపొందిస్తారనేది ఇంకో ప్రశ్న. ఎందుకంటే మౌలికంగా ప్రాంతీయ వాదాలు పాలక వర్గాల పాచికల నుంచి ఉత్పన్నమైనవనేది కాదనలేని ే వాస్తవం. అంతిమంగా ప్రాంతాల కన్నా ప్రయోజనాలే వారిని నడిపిస్తుంటాయి.
చారిత్రిక నేపథ్యాలు స్వరూప స్వభావాలూ భిన్నమైనప్పటికీ వెనకబాటు తనం అన్ని ప్రాంతాలలోనూ వుందనేది కనిపిస్తున్న సత్యం. ఈ వ్యవస్థలో . దోపిడీ పీడనలకు ఏ ప్రాంతం మినహాయింపు కాదు. ఎవరి కోణం నుంచి వారు చేసే వాదనలు, ఇచ్చే అంకెలు క్రోడీకరించడానికి శ్రీకృష్ణ కమిటీ నివేదిక సాధికార పాత్ర పోషించింది. అది దిక్కు మాలిన కమిటి అన్న కెసిఆర్‌ మాటలు, దిక్కు చూపే కమిటీ అన్న శ్రీకృష్ణ వ్యాఖ్యలు ఎలా వున్నా అనేక దిక్కులు అది ప్రస్తావించే అవకాశాలుంటాయి. కనక అటూ ఇటూ తిరిగి బంతి తిరిగి కేంద్రం వైపునే పడుతుంది. దీనిపై ఎంత కాలమైనా చర్చ చేస్తాననే దాని సహనాన్ని స్వాగతిస్తూనే ఏ ప్రాతిపదిక చర్చ చేస్తారని అడగవలసి వుంటుంది. ఈ రోజున ఢిల్లీలో జరిగే సమావేశానంతర పరిణామాలకు ఆ ప్రశ్ననే ప్రాతిపదిక కావాలి. అంతే తప్ప మధ్యంతర ఎన్నికల గురించిన వూహలూ ఆశలూ లేదా రాష్ట్రపతి పాలన పెట్టుకోవచ్చనే వ్యూహాలూ రాష్ట్రాన్ని తీరం చేర్చవు. గతంలో ఈ మార్గాన్ని అనుసరించి అధికారాన్ని కాపాడుకున్న కాంగ్రెస్‌ సమస్య శాశ్వత పరిష్కారానికి మార్గం చూపలేకపోయింది. అపారమైన ప్రకృతి వనరులూ అద్బుతమైన మానవ వనరులూ రాజకీయ చైతన్యం సమరశీల వారసత్వం వున్నా ఈ రాష్ట్రం రావణకాష్టంలా ఉద్రిక్తతల వలయంలో కొనసాగుతున్నదంటే దానికి కేంద్రానిదే ప్రప్రధాన బాధ్యత. రాజకీయ నిర్ణయాలు దాటవేస్తూ సాయుధ బలగాలతో అణచివేత చర్యలు సాగించడం సమస్యను జటిలం చేస్తుందే గాని పరిష్కరించదు. అలాగే రాష్ట్రపతి పాలనతో రాష్ట్రంపై పరోక్ష పాలన వల్ల పట్టు నిలబడవచ్చు గాని ప్రజల ఆమోదం మాత్రం వుండదు. ఏడాది పాటు ఎవరు ఎన్ని విధాల రెచ్చగొట్టినా ఎన్ని వికృత విన్యాసాలు చేసినా చాణక్య లౌక్యాలు ప్రదర్శించినా ప్రాంతాలకు అతీతంగా ప్రజలు ప్రదర్శించిన శాంతి కాంక్ష రాష్ట్రానికి రక్షా కవచమైంది. గత చరిత్ర అటుంచి ఈ ఏడాది కాలంలోనూ వివిధ రాజకీయ పక్షాల నేతల తీరు తెన్నులూ మాటలూ బాటలూ తెలుగు ప్రజలకు గొప్ప గుణపాఠాలు నేర్పించాయి. జీవన పోరాటాలూ సమస్యలపై సమరశీల ఉద్యమాలు తప్ప ఏకాంశ ప్రధానమైన ఎడతెగని వివాదాలు ఎవరికీ శ్రేయస్కరం కాదన్న మెళకువ ప్రతిచోటా ద్యోతకమవుతున్నది. వీరులకు మొగసాల తెలగాణ, చైతన్య రాస్తా కోస్తా, రాణకెక్కిన రాయలసీమ ప్రాంతాలేవైనా సరే ప్రతివారి అసలు రూపాలుఈ తాజా ఘట్టంలో ప్రజలు మరింత బాగా తెలుసుకోగలుగుతారు. ఈ పరీక్షా సమయంలో పరిపక్వత ప్రదర్శించి చెయ్యెత్తి జై కొడతారు. కుటిల రాజకీయాలను చీ కొడతారు. తిరుపతి దోహ కతర్...........