- ఐపిఎల్ వేలంలో గంగూలీ, లారా, గేల్ పట్ల కానరాని ఆసక్తి
- క్రీడాకారుల మ్యూజికల్ ఛైర్స్

తొలి రోజు వేలంలో గౌతం గంభీర్ పట్ల ఫ్రాంఛైజీలు అపరిమితమైన క్రేజ్ ప్రదర్శిం చాయి. తొలిగా పూనే, ముంబయి ఇండియన్స్ అతడి కోసం పోటీపడ్డాయి. అతడి ధర మిలియన్ డాలర్ మార్క్ దాటిన తరువాత అప్పటివరకు మౌనంగా ఉన్న కొల్కతా నైట్రైడర్స్ రంగంలో ప్రవేశించింది. అంతకుముందు రాజస్థాన్ రాయల్స్ కూడా అతడి కోసం ప్రయత్నించింది. తొలి రోజు వేలం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. తొలిగా గంభీర్ను కొల్కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేయడంతో ఈ కార్యక్రమం ఆరంభమైంది. గంభీర్కు ఎంత క్రేజ్ ఉన్నదీ ఈ వేలం కార్యక్రమం చాటి చెప్పింది. భారత క్రీడాకారులపట్ల అత్యంత ఆకర్షణ వ్యక్తమైది. ముగ్గురు క్రికెటర్లు రెండు మిలియన్ల ధర పలికారు. కెవిన్ పీటర్సన్, ఆండ్రూ ఫ్లింటాఫ్ కంటే గంభీర్ ఎక్కువ ధర పలికాడు. కొల్కతా నైట్ రైడర్స్ సహ యజమాని, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. గంభీర్తో పాటు హార్డ్హిట్టింగ్ ఆల్రౌండర్లు యూసుఫ్ పఠాన్(రు.9.66 కోట్లు), జాక్స్ కల్లిస్(రు.5.06 కోట్లు)ను కొల్కతా నైట్రైడర్స్ ఫ్రాంఛైజర్లు కొనుగోలు చేసారు. గత సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్గా ఉన్న గంభీర్ మౌలిక ధర రు.92 లక్షల కంటే పన్నెండు రెట్లు అధిక ధర పలికాడు. భారత్కు చెందిన యూసుఫ్ పఠాన్, రోహిత్ శర్మ (రెండు మిలియన్లు), రాబిన్ ఊతప్ప కూడా రెండు మిలియన్ల మార్క్ను దాటారు. భారత జట్టులో స్థానం కోల్పోవడంలో విఫలమవుతున్న ఇర్ఫాన్ పఠాన్ను ఢిల్లీ డేర్డెవిల్స్ తీసుకకుంది. అతడికి ఎవరూ ఊహించని రీతిలో రు.8.74 కోట్ల ధర పలికింది. భారత క్రీడాకారులపై ఎక్కువ ధర పెట్టేందుకు ఫ్రాంఛైజీలు పోటీపడ్డ వైనం తొలి రోజు వేలం కార్యక్రమంలో ప్రస్ఫుటమైంది. విదేశీ క్రీడాకారుల్లో మహేలా జయవర్థనే మంచి ధర పలికాడు. అతడ్ని కొత్తగా ఐపిఎల్ బరిలో దిగుతున్న కోచ్చి జట్టు రు.6.90 కోట్లకు కొనుగోలు చేసింది.



వివిఎస్ లక్ష్మణ్, శ్రీశాంత్, రుద్రప్రతాప్ సింగ్ (ఆర్పిసింగ్), బ్రెండన్ మెక్కలమ్, మహేలా జయవర్ధనేలను కోచ్చి కొనుగోలు చేసింది. మెక్కలమ్ 475,000 డాలర్లకే అందుబాటులోకి వచ్చాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రీమ్ స్మిత్ను సహారా పూనే వారియర్స్ 500,000 డాలర్లకే కొనుగోలు చేసింది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్ కుమార సంగక్కర, జయవర్ధనే ఈ సారి ఆ జట్టులో ఆడటం లేదు.సంగక్కరను డక్కన్ ఛార్జర్స్, జయవర్ధనేను కోచ్చి కొనుగోలు చేసాయి. డక్కన్ ఛార్జర్స్ కెప్టెన్ ఆడమ్ గిల్క్రిస్ట్ పట్ల ఆ జట్టు సానుకూలత వ్యక్తం చెయ్యలేదు. అతడ్ని పూనే వేలం పాడింది. యువ క్రీడాకారుడు సౌరభ్ తివారీని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు రు.7.36 కోట్లకు సొంతం ం చేసుకుంది.
శనివారం అత్యంత అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటీమణులు ప్రీతీ జింటా, శిల్పాశెట్టి, లిక్కర్ బ్యారన్ విజరు మాల్యా, అతడి కుమారుడు సిద్థార్థ, నీతా అంబానీ, నస్లీ వాడియా ఆకర్షణగా నిలిచారు. గత టోర్నమెంట్లలో ఆడిన అనిల్ కుంబ్లే, స్టీఫెన్ ఫ్లెమింగ్, డరేన్ లెV్ామన్ ఈ కార్యక్రమంలో సహకరించారు. కుంబ్లే, పాంటింగ్ ఈ టోర్నమెంట్కు దూరమయ్యారు. అంతర్జా తీయ జట్టులో స్థానం సంపాదించలేకపోతున్న రాబిన్ ఊతప్పను రు.9.66 కోట్లకు సహారా పూనే వారియర్స్ కొను గోలు చేసింది. ఇంతకుముందు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టులో ఆడిన యువరాజ్ సింగ్ను కూడా ఆ జట్టు తీసు కుంది. అతడికి 8.28 కోట్ల రూపాయల ధరను నిర్ణ యించింది. రోహిత్ శర్మకు కూడా అనూహ్యంగా భారీ ధర పలికింది. అతడ్ని రు.9.2 కోట్లకు ముంబయి ఇండియన్స్ వేలం పాడింది.
గంగూలీ, హతవిథీ!
కొల్కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ప్రధాన ఆకర్షణ కానున్నాడని అందరూ భావించిన వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా, వెస్టిండీస్ కెప్టెన్ క్రిస్ గేల్ పట్ల ఫ్రాంఛైజీలెవ్వరూ ఆసక్తి చూపకపోవడం తొలి రోజు సంచలనం సృష్టించింది. వీరితో పాటు టి20 స్పెషలిస్ట్లుగా పేరుగాంచిన జెస్సీ రైడర్, హెర్షల్లీ గిబ్స్, మార్క్ బౌచర్, గ్రీమ్ స్వాన్లను ఎవరూ కొనుగోలు చెయ్యలేదు. మొదటి రౌండ్ ముగిసిన తరువాత వీరిని ఎవరైనా ఫ్రాంఛైజీకొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పటికీ తొలి రౌండ్లో అవకాశం లభించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వారి పట్ల తగ్గిపోయిన క్రేజ్కు ఇది తార్కాణంగా నిలుస్తుంది.
No comments:
Post a Comment