Sunday, January 9, 2011
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పదా?
జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెల్లడైన తరువాత తెలంగాణాలో ఊపందుకుంటున్న ఆందోళనలు సీమాంధ్రకు విస్తరించి రాష్ట్ర ప్రభుత్వం అదుపుచేయలేని దశకు చేరుకుంటే రాష్ట్రపతి పాలన తప్పక పోవచ్చు.శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని అంశాలు వెలుగులోకి వచ్చిన తరువాత తెలంగాణ ప్రజా ప్రతినిధుల్లో కనిపిస్తున్న ఆందోళన సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల్లో లేదు.తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే తప్ప నియోజక వర్గాలలో అడుగుపెట్టలేమని తెలంగాణ ప్రాంత ఎంపీల్లో అత్యధికులు హైకమాండ్కు స్పష్టం చేస్తూ, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టకపోతే ఎంపీ సభ్యత్వాలకు రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఒక వేళ కేంద్రం తెలంగాణ వైపు మొగ్గు చూపితే అటూ సీమాంధ్రల్లో సైతం ఆందోళనలు చెలరేగే అవకాశం ఉంది.ఎంపీలతోపాటు ఎమ్మెల్యేలూ రాజీనామా బాట పడితే ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుంది. రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా చూడడానికి మూడు ప్రాంతాలకు చెందిన ఎంపీలతో మరోవిడత చర్చలు జరపాలని అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది.ఒక వేళ చర్చలు సఫలం కాక పోతే రాష్ట్రపతి పాలన తప్పక పోవచ్చనే వాదనలు సర్వత్ర వినిపిస్తున్నాయి.శ్రీకృష్ణ కమిటీ నివేదిక అమలుపై అన్ని విషయాలను కూలంకశంగా చర్చించి చిట్టచివరి అస్త్రంగా రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టే దిశలో కేంద్రం అన్ని అంశాలను అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment